Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''ఆర్ఆర్ఆర్'' నుంచి డైసీ అవుట్.. జక్కన్న టీమ్ ప్రకటన

''ఆర్ఆర్ఆర్'' నుంచి డైసీ అవుట్.. జక్కన్న టీమ్ ప్రకటన
, శనివారం, 6 ఏప్రియల్ 2019 (12:57 IST)
దర్శకధీరుడు, జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ''ఆర్ఆర్ఆర్''. రామ్ చరణ్ సరసన అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్జర్ జోన్స్ హీరోయిన్లుగా నటించనున్నారని చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

ఈ చిత్రంలో హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ నటించడం లేదని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో త్వరలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ కోసం జక్కన్న వేట ప్రారంభించారు. 
 
కాగా మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ చిత్రం ప్రస్తుతం గుజరాత్‌లోని వడోదరాలో షూటింగ్ జరుపుకుంటున్న తరుణంలో.. రామ్ చరణ్‌కు గాయం కావడంతో మూడు వారాల పాటు షూటింగ్‌ను పోస్ట్ పోన్ చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో అనివార్య కారణాల వల్ల డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో కొనసాగలేకపోతున్నారు. ఆమె భవిష్యత్‌ అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నామని ట్రిపుల్ ఆర్ టీమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''మహర్షి'' నుంచి టీజర్ అవుట్.. సక్సెస్‌లో ఫుల్‌స్టాప్స్ వుండవ్.. (Video)