Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణా ప్రజలు అసలు అది చూశారా...? తిట్టిపోసిన రాంగోపాల్ వర్మ.. ఎందుకు?

Advertiesment
RGV
, బుధవారం, 5 డిశెంబరు 2018 (19:13 IST)
తెలంగాణా ప్రజలు మూర్ఖులు, గొర్రెలు. ఓటు ఎందుకు వేస్తారో వారికే తెలియదు. ఏదైనా ఒక పని చేసే ముందు దానిపైన అవగాహన ఉండాలి. అది ఏ మాత్రం ప్రజలకు లేదు. ఓటు విషయంలోను అదే చేస్తున్నారు. రెండు రోజుల్లో తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఓటు ఎందుకు వేస్తాము.. ఎవరికి వేయాలి ముందుగా తెలుసుకోవాలి. అది చాలామంది తెలంగాణా ప్రజలు ఇప్పటికీ తెలుసుకోనేలేదు. ముందు అది మానుకోండి.
 
అసలు మ్యానిఫెస్టో గురించి మీకు తెలుసా.. కాంగ్రెస్... టిఆర్ఎస్ పార్టీలు విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఏముందో తెలంగాణా రాష్ట్రంలోని ప్రజలకు అస్సలు తెలియదు. ఓటర్లలో 90 శాతం మంది చూసి ఉండరు. ఎందుకు ఇలా చేస్తున్నారు. అందుకే మీరు గొర్రెలు.. మూర్ఖులు.. మీకు ఏమీ తెలియదు అంటూ తెలంగాణా ప్రజలను టార్గెట్ చేస్తూ విమర్సలు చేశారు రాంగోపాల్ వర్మ. 
 
రాంగోపాల్ వర్మ తెలంగాణా ప్రజలపై అలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఆయన ముందే నువ్వు మెంటల్ అంటూ తిట్టుకుంటూ వెళ్ళారు జనం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ‌న‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న‌ నంద‌మూరి హీరో