Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాక్షి టీవీ మైక్ ఎందుకు పట్టుకున్నానంటే..? రేణూ దేశాయ్

సాక్షి టీవీ మైక్ ఎందుకు పట్టుకున్నానంటే..? రేణూ దేశాయ్
, గురువారం, 28 ఫిబ్రవరి 2019 (19:00 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్.. సాక్షి టీవీకి మద్దతు తెలుపుతూ ప్రచారం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ప్రస్తుతం రేణూ స్పందించారు. కర్నూలు జిల్లాలో పవన్ పర్యటించిన అదే సమయంలో రేణూ కూడా ఆ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మైకు పట్టుకుని రైతుల వద్ద ఇంటర్వ్యూ తీసుకున్నారు. 
 
ఈ పర్యటన సందర్భంగా రేణు దేశాయ్ సాక్షి టీవీ రిపోర్టర్ అవతారం ఎత్తడం జనాల్లో పలు అనుమానాలను రేకెత్తించింది. పవన్‌కు వ్యతిరేకంగా రేణును వైసీపీ రంగంలోకి దించిందని జోరుగా ప్రచారం సాగింది.

ఈ వార్తలపై రేణూ దేశాయ్ స్పందిస్తూ.. రైతుల జీవితాలను, వారికష్టనష్టాలను వెలుగులోకి తెచ్చేందుకే సాక్షి మైక్ చేతబట్టానని చెప్పారు. అంతేకానీ ఇందుకు రాజకీయాలకు ముడిపెట్టవద్దని... ఓ టీవీ కార్యక్రమంలో భాగంగా రైతుల కష్టాలను షూట్ చేయాల్సి వచ్చిందని రేణూ దేశాయ్ వెల్లడించారు. 
 
ఇప్పటి వరకు తాను 200 మంది రైతులను కలిశానని, వారి జీవితాలు దుర్భరంగా ఉన్నాయని రేణూ దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సహకారం అందించేలా ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని, తన కార్యక్రమం వల్ల ఒక్క రైతైనే బాగుపడినా సంతోషిస్తానని వెల్లడించారు. రైతుల కోసం ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ పని చేశానని.. రైతుల కోసం ఓ సినిమా రాశాను. దానికి అనుగుణంగానే రైతులను కలిశానని రేణు దేశాయ్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాఘవేంద్రరావు సినిమాలో షారూఖ్ ఖాన్..?