Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెబ‌ల్‌స్టార్ కుటుంబంతో ఎంజాయ్‌... ఎక్క‌డ‌!

రెబ‌ల్‌స్టార్ కుటుంబంతో ఎంజాయ్‌... ఎక్క‌డ‌!
, మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (17:13 IST)
Krishnam Raju, Family
షూటింగ్ స‌మ‌యంలో హీరోలు ,హీరోయిన్లు హాయిగా విదేశాల్లో దీవుల్లో ఎంజాయ్ చేస్తుంటారు. వాటిని సోష‌ల్‌మీడియా పెట్టి అభిమానుల‌కు క‌నువిందు చేస్తుంటారు. వ‌య‌స్సులో వున్న భామ‌లు అయితే యూత్ కోసం ప్ర‌త్యేకంగా బికినీల‌తో ద‌ర్శ‌న‌మిస్తుంటారు. అయితే వ‌య‌స్సుతో నిమిత్తం లేకుండా క‌టుంబంతో కూడా ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ కోవ‌లో మోహన్ బాబు కూడా త‌న కుటుంబంతో మాల్దీవుల‌కు వెళ్ళి ఎంజాయ్ చేస్తూ హంగామా చేశారు. 
 
ఇప్పుడు రెబెల్ స్టార్ కృష్ణం రాజు కూడా తన ఫ్యామిలీ తో కలిసి మాల్దీవ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. త‌న స‌తీమ‌ణి, ముగ్గురు కూతుళ్ళ‌తో క‌లిసి రీసెంట్‌గా మాల్దీవుల‌కు వెళ్ళారు. అక్కడ కృష్ణంరాజు ఆయ‌న స‌తీమ‌ణి శ్యామ‌ల క‌లిసి దిగిన ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాను షేక్ చేస్తుంది.

మ‌రోవైపు ఉప్ప‌ల‌పాటి ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేములో క‌నిపిస్తున్న ఫొటో కూడా నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. పైగా ఈరోజు ప్ర‌భాస్ తాజా షూటింగ్ కూడా మొద‌టి షెడ్యూల్ పూర్త‌యింది. ఇదే రోజు ఫొటోలు పెట్ట‌డంతో ప్ర‌భాస్‌కూడా ఏమైనా అక్క‌డ వున్నారా! అంటూ సెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుష్ప సెట్లో ఆచార్య ఏం చేస్తున్నాడు!