Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వివాదంలో లైగర్‌: టేబుల్‌పై కాలుపెట్టిన విజయ్ దేవరకొండ.. అసలు ఏం జరిగింది.?

Liger
, శనివారం, 20 ఆగస్టు 2022 (15:13 IST)
Liger
హైదరాబాద్‌ ప్రెస్‌మీట్‌లో కొందరు తెలుగు జర్నలిస్టులతో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య చిట్ చాట్ జరిగింది. ఈ సందర్భంగా లైగర్ మూవీకి సంబంధించి విషయాలను ప్రస్తావించారు. ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతున్న సమయంలో విజయ్‌ టేబుల్‌పై ఇలా తన రెండు కాళ్లు పెట్టాడు. 
 
అంతే.. ఆ వీడియోను చూసిన కొంతమంది విజయ్ దేవరకొండపై భారీగా ట్రోల్స్ చేశారు. పాన్‌ ఇండియా హీరో అయ్యే సరికి విజయ్‌కు పొగరు పెరిగిందని అనేక మీడియా వెబ్‌సైట్స్‌, సోషల్‌మీడియాల్లో వార్తలు వైరల్ అయ్యాయి.
 
దీనిపై ఆ ప్రెస్‌మీట్లో ఉన్న ఒక విలేకరి స్పందించాడు. అసలు ఆరోజు ఏం జరిగిందో వివరించాడు. విజయ్‌ దేవరకొండను తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్నాడు. ఆయన మాతో ఎంతో సరదాగా ఉంటారని తెలిపారు.  
 
మీతో ఫ్రెండ్లీగా మాట్లాడాలంటే కొంచెం బెరుకుగా ఉందన్నారు. అప్పుడు విజయ్ ఆ విలేకరిలోని భయాన్ని పొగొట్టేందుకు మీరు అవన్నీ పట్టించుకోవద్దన్నాడు. 
 
మనమంతా సరదాగా మాట్లాడుకుందామన్నాడు. మీరు కాలు మీద కాలేసుకుని కూర్చొండని, తానూ కాలు మీద కాలేసుకుని కూర్చొంటానని ఫ్రెండ్లీగా అనేశారు. విజయ్‌ అలా అనడంతో అక్కడివారంతా నవ్వుకున్నారని అసలు విషయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో ధనుష్ అభిమానుల అతి చర్య.. థియేటర్ స్క్రీన్ చింపివేత