Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

Advertiesment
mahesh babu

ఠాగూర్

, సోమవారం, 7 జులై 2025 (10:31 IST)
టాలీవుడ్ అగ్ర హీరో మహేశ్ బాబుకు వినియోగదారుల ఫోరం కోర్టు నోటీసులు జారీచేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు మహేశ్ బాబు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాురు. దీంతో రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం ఈ నోటీసులు జారీచేసింది. 
 
మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటి ప్రతివాదిగా, యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా, ప్రచారకర్త సినీనటుడు మహేశ్ బాబును మూడో ప్రతివాదిగా చేర్చుతూ కమిషన్‌లో ఫిర్యాదు దాఖలైంది.
 
కేసు వేసిన ఓ వైద్యురాలు, మరో వ్యక్తి.. రెండో ప్రతివాది మాటలు నమ్మి బాలాపూర్ గ్రామంలో చెరో ప్లాట్ కొనడానికి రూ.34,80,000 చెల్లించారు. అన్ని అనుమతులు ఉన్నాయని, మహేశ్ బాబు ఫొటోతో ఉన్న బ్రోచర్ వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులై డబ్బు చెల్లించినట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. 
 
తర్వాత లేఅవుట్ లేదని తెలుసుకొని డబ్బు తిరిగి ఇవ్వమంటే రెండో ప్రతివాది అతికష్టం మీద కేవలం రూ.15 లక్షలు మాత్రమే వాయిదాల్లో ఇచ్చారు. అనంతరం ఆలస్యం చేస్తూ ముఖం చాటేయడంతో మిగతా డబ్బు ఇప్పించమని ఫిర్యాదుదారులు కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో మహేశ్ బాబుతో పాటు మిగిలిన వారికి కోర్టు నోటీసులు పంపించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!