బాలీవుడ్లో మూడో సినిమా దో లఫ్జోంకీ కహాని సినిమా ద్వారా కాజల్ అగర్వాల్ తొలిసారి అంధురాలిగా నటించింది. ఈ పాత్ర మహిమో ఏమో కానీ.. తాను నేత్రదానం చేస్తానని ప్రకటించింది. తద్వారా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన మానవత్వాన్ని చాటుకుంది. బాలీవుడ్లో ఇప్పటికే సింగం, స్పెషల్ 26 సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్ మూడో సినిమా ‘దో లఫ్జోంకీ కహాని’ శుక్రవారం రిలీజ్ కానుంది.
ఈ సినిమాలో అంధురాలి పాత్ర కోసం పలువురు అంధులైన విద్యార్థులను కలిసి వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంది. అంధుల కష్టాలు గమనించిన కాజల్ మరణానంతరం తన కళ్లు దానం చేస్తానని ప్రకటించింది. అంధురాలి పాత్ర తనలో మార్పు తీసుకొచ్చిందని అంటోంది కాజల్ అగర్వాల్. కంటి చూపు విలువేంటో తెలిసొచ్చిందని.. అందుకే తన కళ్లను దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇకపోతే కాజల్ అగర్వాల్తో నటించిన హీరో రణదీప్ హూడా కూడా తన కళ్లను దానం చేసేందుకు నిర్ణయించుకున్నారు.