Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినిమా టికెట్ల అంశంలో ప్రభుత్వ జోక్యం తగదు: వర్మ

సినిమా టికెట్ల అంశంలో ప్రభుత్వ జోక్యం తగదు: వర్మ
, గురువారం, 30 డిశెంబరు 2021 (12:32 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్‌లో సినీ టిక్కెట్ల వ్యవహారంపై స్పందించాడు. సినిమా టికెట్ల అంశంలో ప్రభుత్వ జోక్యం తగదని అన్నారు. ఓ వస్తువును ప్రైవేటు వ్యక్తులు ఉత్పత్తి చేసి, వినియోగదారుడికి అమ్మే క్రమంలో పన్నులు ప్రభుత్వానికే వెళతాయని, అయితే, ఇందులో ప్రభుత్వం ధరలు నిర్ణయించడం ఉండదని వర్మ వివరించారు. సినిమా టికెట్ల అంశానికి కూడా ఇదే వర్తిస్తుందని స్పష్టం చేశారు.
 
ఓ వస్తువు ఉత్పత్తిదారుకే ఎమ్మార్పీ నిర్ణయించే అధికారం ఉంటుందని, కొనాలా? వద్దా? అనేది వినియోగదారుడు నిర్ణయించుకుంటాడని వర్మ వ్యాఖ్యానించారు. సినిమా టికెట్ల రేట్లను నిర్మాతలు నిర్ణయించడంలో తప్పేమీలేదని పేర్కొన్నారు. ఈ అంశంలో ప్రభుత్వం టికెట్ల రేట్లు నిర్ణయించడం ఏంటో అర్థంకావడంలేదని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కెమెరాలో లైగ‌ర్ లుక్‌కు ఫిదా అయిన అభిమానులు