Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో చెర్రీ సందడి...

rto ram charan

ఠాగూర్

, మంగళవారం, 22 అక్టోబరు 2024 (19:59 IST)
టాలీవుడ్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మంగళవారం హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. తన కొత్త రోల్స్ రాయిస్ కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఈ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆర్టీఏ ఆఫీసులో భారీ కోలాహలం నెలకొంది. 
 
రామ్ చరణ్‌ను దగ్గర నుంచి చూసేందుకు జనాలు, సిబ్బంది పోటీపడ్డారు. కాగా, రావాణా శాఖ అధికారులు చరణ్‌కు సాదర స్వాగతం పలికారు. పలువురు ఉన్నతాధికారులు వచ్చి రామ్ చరణ్‌ను మర్యాదపూర్వకంగా పలకరించారు. రామ్ చరణ్‌తో ఫోటోలు దిగారు. 
 
ఇక రామ్ చరణ్ ఆర్టీఏ కార్యాలయంలో అవసరమైన లాంఛనాలు పూర్తి చేసి కొత్త కారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కాగా, రామ్ చరణ్‌ కొనుగోలు చేసింది రోల్స్ రాయిస్‌‍ స్పెక్టర్ మోడల్ కారు అని తెలుస్తుంది. దీని ధర రూ.7.5 కోట్ల వరకు ఉంటుంది. ఇది సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.5 సెకన్లలోనే అందుకుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సవత్తరంగా బాలకృష్ణ - చంద్రబాబు "అన్‌స్టాపబుల్ షో"