Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామ్ చరణ్ కోసం.. గద్వాల్ నుంచి హైదరాబాద్ వరకు అభిమాని పాదయాత్ర

రామ్ చరణ్ కోసం.. గద్వాల్ నుంచి హైదరాబాద్ వరకు అభిమాని పాదయాత్ర
, శుక్రవారం, 25 జూన్ 2021 (19:24 IST)
ఇటీవల తన అభిమాన నటుడు సోనూసూద్‌ను కలవడం కోసం ఏకంగా హైదరాబాద్ నుంచి ముంబై దాకా పాదయాత్ర చేసిన ఘటన మరువక ముందే మళ్ళీ అలాంటి ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది.

తమ అభిమాన హీరో రామ్ చరణ్‌ను కలిసేందుకు తెలంగాణలో గద్వాల్ జిల్లా నుంచి ముగ్గురు రామ్ చరణ్ వీరాభిమానులు హైదరాబాద్ దాకా నడుచుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి హైదరాబాద్ ఏకంగా 240 కిలోమీటర్ల దూరం ఉండటం గమనార్హం. సంధ్య జయరాజ్, రవి, వీరేష్ అనే ముగ్గురు జూన్ 20వ తేదీన రామ్ చరణ్ ని కలిసి ఉద్దేశంతో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా పాదయాత్ర ప్రారంభించారు. 
 
జూన్ 24వ తేదీకి హైదరాబాద్ చేరుకున్న వీరు రామ్ చరణ్ ఇల్లు ఎక్కడ ఉన్నదో తెలియక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు చేరుకున్నారు. అయితే వీరు పాదయాత్ర చేసుకుంటూ వచ్చిన విషయాన్ని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రామ్ చరణ్ దృష్టికి తీసుకువెళ్లగా రామ్ చరణ్ వారి అభిమానానికి పొంగిపోయాడు. 
webdunia
Ramcharan


వారిని ఇంటికి ఆహ్వానించాడు. ఇంటికి పిలవడమే గొప్ప అని అభిమానులు భావిస్తున్న తరుణంలో అలా పిలవడమే కాక వారికి హగ్ కూడా ఇవ్వడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏకంగా ముగ్గురితో రామ్ చరణ్ ఒక గంట పాటు గడిపినట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంపూర్ణేష్‌బాబు ‘క్యాలీఫ్లవర్‌’ షూటింగ్‌ పూర్తి