Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రజినీకాంత్ కుమార్తెకు మళ్లీ పెళ్లి.. వరుడు ఎవరంటే...

రజినీకాంత్ కుమార్తెకు మళ్లీ పెళ్లి.. వరుడు ఎవరంటే...
, బుధవారం, 23 జనవరి 2019 (14:58 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య మళ్లీ పెళ్లి కుమార్తె కానుంది. ఆమెకు వచ్చే నెలలో రెండో పెళ్ళి జరుగనుంది. ఒక బిడ్డ తల్లిగా ఉన్న సౌందర్యకు తొలుత 2010లో తొలిసారి వివాహమైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త అశ్విన్ కుమార్‌తో పెళ్లి జరిగింది. ఆ తర్వాత వీరికి వేద్ కృష్ణ అనే ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కానీ, భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా గత 2017లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. 
 
అప్పటినుంచి సౌందర్య ఒంటరిగానే ఉంది. దీంతో ఆమెకు రెండో పెళ్లి చేయాలని రజినీకాంత్ నిర్ణయం తీసుకుని, కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త విశాగన్ వనంగమూడి అనే వరుడును ఎంపిక చేశారు. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది. వీరి వివాహం వచ్చే నెల 11వ తేదీన జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇందులోభాగంగా 9వ తేదీన మెహందీ, సంగీత్ వేడుకలు నిర్వహిస్తారు. చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్‌లో ఈ వేడుకలు జరుగున్నాయి. 
 
కాగా, విశాగన్‌కు కూడా ఇది రెండో వివాహమే. ఆయన వంజగర్ ఉలగమ్ అనే సినిమాతో తమిళ తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు సినిమాల్లో సహ నటుడిగా పనిచేశారు. సినిమాలతో పాటు ఆయన ఫార్మాస్యూటికల్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఇక సౌంద‌ర్య‌ కూడా ఇటు దర్శకురాలిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. కెరీర్ తొలినాళ్ళ‌లో గ్రాఫిక్ డిజైన‌ర్‌గా ప‌ని చేసింది సౌంద‌ర్య‌. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుండెల్ని పిండేస్తున్న ఐశ్వర్యారాయ్ భర్త కామెంట్స్...