Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా దురదృష్టం... వారందరినీ కోల్పోతున్నాను : రాజేంద్రప్రసాద్

టాలీవుడ్ సీనియర్ హాస్య నటుడు గుండు హనుమంతరావు మృతిపై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గుండు భౌతికకాయానికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన మాట్లాడుతూ, గుండుతో తన అనుబంధ

నా దురదృష్టం... వారందరినీ కోల్పోతున్నాను : రాజేంద్రప్రసాద్
, సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (10:43 IST)
టాలీవుడ్ సీనియర్ హాస్య నటుడు గుండు హనుమంతరావు మృతిపై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గుండు భౌతికకాయానికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన మాట్లాడుతూ, గుండుతో తన అనుబంధం ఎన్నటికీ మరిచిపోలేనిదన్నారు. యలోడు, పేకాట పాపారావు, హైహై నాయకా, కొబ్బరి బొండాం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తాము కలసి నటించామని, తాను హీరోగా చేసిన దాదాపు 50 సినిమాల్లో గుండు హనుమంతరావు నటించి మెప్పించారని అన్నారు. 
 
'నా దురదృష్టం... నాతో పాటు ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ వంటివానిని నేను కోల్పోయాను. ఇవాళ మరొక... నా సోదరుడి వంటి వాడిని కోల్పోయాను. అందరమూ వెళ్లిపోవాల్సిందే. ఇక్కడ ఎవరమూ పర్మినెంట్ కాదు. కాకపోతే... ఒక మనసుకు నచ్చిన వ్యక్తి గుండు హనుమంతరావు. నటుడిగా కన్నా మంచి వ్యక్తిగా నాకు తెలుసు' అని భావోద్వేగంతో మాట్లాడారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాస్య నటుడు గుండు హనుమంతరావు కన్నుమూత