Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Advertiesment
dr rajasekhar

ఠాగూర్

, సోమవారం, 8 డిశెంబరు 2025 (19:34 IST)
ఓ సినిమా షూటింగులో ప్రమాదం జరిగింది. ఇందులో హీరో డాక్టర్ రాజశేఖర్‌ కాలికి గాయమైంది. దీంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాజశేఖర్ తమిళంలో విజయవంతమైన 'లబ్బర్ పందు' అనే సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు ఆయన కాలి చీలమండకు గాయమైంది. దీన్ని పరీక్షించిన వైద్యులు చీలమండలో క్రాక్స్ ఉన్నట్టు గుర్తించి వెంటనే ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత నాలుగు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. 
 
కాగా, రాజశేఖర్‌కు గాయం కావడంతో సినిమా షూటింగును తాత్కాలికంగా నిలిపివేశారు. చిత్రీకరణను తిరిగి వచ్చే యేడాది జనవరిలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ హీరోగా నటిస్తుండగా, రాజశేఖర్ కుమార్తె శివానీ హీరోయిన్‌ పాత్రను పోషిస్తోంది. దాదాపు 27 యేళ్ల తర్వాత రమ్యకృష్ణ ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన నటిస్తున్నారు. కాగా, ప్రమాద వార్త తెలిసిన కొందరు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్