Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''సైరా'' కోసం తమన్నా కత్తిపట్టింది.. ''రేసుగుర్రం'' సీక్వెల్‌కు బన్నీ రెడీ..

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా రేసుగుర్రం. 2014లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. 2014లో

''సైరా'' కోసం తమన్నా కత్తిపట్టింది.. ''రేసుగుర్రం'' సీక్వెల్‌కు బన్నీ రెడీ..
, గురువారం, 10 మే 2018 (16:10 IST)
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా రేసుగుర్రం. 2014లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. 2014లో ఘన విజయం సాధించిన ఈ సినిమా.. బన్నీ మేనరిజానికి పక్కాగా సెట్ అయ్యింది. అలాంటి ఈ సినిమాకు సీక్వెల్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అల్లు అర్జున్ వున్నాడట. 
 
మొదటి సినిమాకి కథాపరమైన కొనసాగింపుగా కాకుండా, మరో కోణంలో కథ ఉంటే బాగుంటుందని అల్లు అర్జున్ అనుకుంటున్నాడట. ప్రస్తుతానికి సురేందర్ రెడ్డి.. 'సైరా' సినిమాతో బిజీగా వున్నాడు. ఆ ప్రాజెక్టు పూర్తయిన తరువాత 'రేసుగుర్రం' సీక్వెల్ పట్టాలెక్కనున్నట్టు చెబుతున్నారు. 
 
ఇక సైరా సంగతికి వస్తే.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఒక కీలకమైన పాత్ర కోసం తమన్నాను ఎంపిక చేశారట. ఈ రోల్ కోసం తమన్నా కత్తి పట్టనుంది. ఈ సినిమాలో 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' కోసం ప్రాణాలను అర్పించే వీరనారిగా తమన్నా కనిపించనుంది.
 
ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం తమన్నా కత్తి పట్టిందట. ఇంకా గుర్రంపై స్వారీ చేస్తూ తమన్నా కత్తియుద్ధం చేయనుంది. ఈ సన్నివేశాలు ప్రేక్షకుల్లో విజిల్స్ వేయించేలా వుంటాయని చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్? ఎన్టీఆర్ పాత్ర అలా వుండదు?