Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఛార్మిని దూరం పెడుతున్న పూరీ జగన్నాథ్.. కారణం అదేనా?

puri - charmy
, శనివారం, 18 జూన్ 2022 (14:26 IST)
డైరక్టర్ పూరీ జగన్నాథ్‌ సినీనటి ఛార్మిని దూరం పెడుతున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీపైనే ఫుల్ ఫోకస్ పెడుతున్నారని.. దీంతో ఛార్మీని పెద్దగా పట్టించుకునేందుకు టైమ్ లేదని ఫిలిమ్ నగర్ పండితులు అంటున్నారు.
 
ప్రస్తుతం సొంత బ్యానర్ లో సినిమాలు చేస్తున్నారు. వైష్ణో అకాడమీనే పూరీ కనెక్ట్స్‌గా మార్చి ఆ నిర్మాణ సంస్థను కూడా స్థాపించడం జరిగింది. పూరీ బ్యానర్ వ్యవహారాలను ప్రస్తుతం హీరోయిన్ చార్మీ చూసుకుంటూ ఉంది. 
 
చార్మీ పూరీకి బాగా దగ్గరైన సంగతి అందరికీ తెలిసిందే పూరి జగన్నాథ్ ఎక్కడ ఉంటే కచ్చితంగా ఛార్మి అక్కడే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
 
కానీ ప్రస్తుతం సీన్ మారింది. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు ఇప్పటికే తన తండ్రి అడుగుజాడలలో ఆకాశ్ నడుచుకుంటూ టాలీవుడ్‌లో మంచి హీరో అవుతారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. 
 
పూరి జగన్నాథ్ కూతురు ఇటీవల తన విద్యను పూర్తి చేసుకొని సినిమాల పట్ల తనకు ఉన్న ఆసక్తి కారణంగా తన తండ్రితో మాట్లాడి నిర్మాణ బాధ్యతలను చూసుకుంటానని తెలియజేసిందట. దీంతో పూరీ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.
 
ప్రస్తుతం పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇక ఈ చిత్రం అయిపోయిన వెంటనే విజయ్‌తో కలిసి జనగణమన సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంతోనే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూతురు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఇక దీంతో పూరీ జగన్నాథ్ అభిమానులు సైతం ఛార్మిని దూరం పెడుతున్నారు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తన కూతురు అండతోనే తన భార్యకు దగ్గర అవబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కల్యాణ్ నా దేవుడు, కానీ ఎవర్నీ నమ్మొద్దు, ఏమైంది గణేశన్నా? ఆడియో షేర్ చేసావేంటన్నా?