Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేమూరి రాధాకృష్ణ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి

వేమూరి రాధాకృష్ణ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
, మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (09:53 IST)
‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం కలిగింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ(63) కన్నుమూశారు. వేమూరి కనకదుర్గ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఉద్యోగులు సంతాపం తెలియజేశారు. ఇవాళ ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 మధ్య జూబ్లీహిల్స్‌‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
 
ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంతాపం
ఆంధ్రజ్యోతి – ఏబీఎన్ సంస్థల ఎమ్.డి. శ్రీ వేమూరి రాధాకృష్ణ గారి సతీమణి శ్రీమతి కనకదుర్గ గారు తుదిశ్వాస విడిచారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. శ్రీమతి కనకదుర్గ గారు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ రాధాకృష్ణ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. ఈ విషాదాన్ని తట్టుకొనే మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
 
(పవన్ కల్యాణ్)
 
చిరంజీవి సంతాపం

ఆంధ్ర‌జ్యోతి- ఏబీఎన్ సంస్థ‌ల ఎమ్‌.డి.. జ‌ర్న‌లిస్ట్.. సంపాద‌కులు శ్రీ వేమూరి రాధాకృష్ణ గారి సతీమ‌ణి శ్రీ‌మ‌తి క‌న‌క‌దుర్గ గారు తుదిశ్వాస విడిచార‌ని తెల‌సి దిగ్భ్రాంతికి లోన‌య్యాను. జీవిత భాగస్వామికి నిజమైన నిర్వచనంగా మీ ప్రతి అడుగులో అడుగైన కనకదుర్గ గారి అకాల మరణ వార్త  నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ దుఃఖ సమయంలో మీరు తట్టుకొనే శక్తి ని ఆ భగవంతుడు ప్రసాదించాలని  కోరుకుంటున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ, మీ  కుటుంబమంత‌టికీ నా సంతాపం తెలియజేసుకుంటున్నాను. 
 
-చిరంజీవి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోరలు చాస్తోన్న కరోనా... నటి మాలా శ్రీ భర్త మృతి