Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కళ్యాణ్ సరసన కథానాయికగా ప్రియాంక మోహన్

Pawan, priyanka
, బుధవారం, 19 ఏప్రియల్ 2023 (13:49 IST)
Pawan, priyanka
ఆస్కార్ విజేత అయిన 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మాణంలో ఒక భారీ యాక్షన్ డ్రామా కోసం దర్శకుడు సుజీత్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూట్లో నిన్నే జాయిన్ అయ్యారు. మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 15 న ముంబైలో ప్రారంభమైంది. కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఈ వారం ప్రారంభంలోనే ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ, ఈ రోజు మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌తో  మన ముందుకు వచ్చారు.
 
'డాక్టర్‌', 'డాన్‌', 'గ్యాంగ్‌ లీడర్', 'శ్రీకారం' వంటి చిత్రాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మోహన్‌ ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైంది. ఈ నటి సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్‌ను కలిగి ఉంది. ఆమె తన రూపం, శైలితో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటను తెరపై చూడాలని సినీ ప్రియులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసున్నారు.
 
ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ ముంబై పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరగనున్న ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై యాక్షన్ సన్నివేశాలతో పాటు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు సుజీత్ ఎక్కడా రాజీపడకుండా అద్భుతమైన యాక్షన్ చిత్రాన్ని అందించడానికి కృషి చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణాది చిత్రాల్లో నటించడం వల్లే గుర్తింపు రాలేదు : తాప్సీ