Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ హీరోయిన్‌కు మణిరత్నం ఛాన్స్ ఇచ్చాడా... వైరల్ అవుతున్న రూమర్లు

ఆ హీరోయిన్‌కు మణిరత్నం ఛాన్స్ ఇచ్చాడా... వైరల్ అవుతున్న రూమర్లు
, మంగళవారం, 25 జూన్ 2019 (17:22 IST)
దక్షిణాదిలో ఎన్నో భారీ సక్సెస్‌లను స్వంతం చేసుకున్న ప్రముఖ చలనచిత్ర దర్శకుడు గత కొద్దికాలంగా సక్సెస్‌లు లేక డీలాపడిపోయారు. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ అనే ఓ చారిత్రాత్మక చిత్రాన్ని తీయడానికి సిద్ధమవుతున్నాడు.


ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటూ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి కావాల్సిన సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర యూనిట్ అందించిన సమాచారం మేరకు ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్న క్రమంలో నటీనటులు ఎంపికపై దృష్టిపెట్టారు దర్శకుడు మణిరత్నం. 
 
ఈ సందర్భంలో మణిరత్నంను ప్రేమమ్ హీరోయిన్, మలయాళ ముద్దుగుమ్మ మడొన్నా సెబాస్టియన్ కలవడం వలన ఆమె పొన్నియన్ సెల్వన్‌ చిత్రంలో నటించనున్నారనే వార్త వైరల్‌గా మారింది.

దర్శకుడు మణిరత్నంను కలిసిన తర్వాత మడోన్నా సెబాస్టియన్‌ ఒక సెల్ఫీ దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటుగా ఈ రోజు నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. నేను ఏమీ మాట్లాడలేను కానీ ఈ ఫొటో మాట్లాడుతుంది. నా మనసును, గుండెను అద్భుతమైన సినిమా వెంటాడుతోందంటూ షేర్ చేసారు.
 
కానీ మణిరత్నంను కలవడానికి గల కారణం మాత్రం చెప్పలేదు. మణిరత్నం క్యాంప్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఈ చిత్రంలో నటించే నటీనటుల గురించి ఎలాంటి అధికారిక ధృవీకరణలు లేకపోయినప్పటికీ విక్రమ్, జయం రవి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, మోహన్ బాబు, అనుష్కశెట్టి, అమలా పాల్ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. చోళ సామ్రాజ్యపు కథా నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూరి జగన్నాథ్‌కు గురించి షాకిచ్చిన వర్మ