Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స‌మంత కోసం ప్ర‌శాంత్ వ‌ర్మ క‌థ సిద్ధం చేస్తున్నాడు

Advertiesment
Prashant Varma
, గురువారం, 13 మే 2021 (12:12 IST)
Prasanth varma, samantha
జాంబీ రెడ్డి చిత్రంతో ఒక్క‌సారిగా హాలీవుడ్ త‌ర‌హా క‌థ‌తో ముందుకు వ‌చ్చిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. 2019లో క‌రోనా వ‌ల్ల ఏర్ప‌డిన అనిశ్చితితో ఆయ‌న మైండ్లో వ‌చ్చిన ఆలోచ‌న‌కు కార్య‌రూపం పెట్టి ఆక‌ట్టుకునేలా బాంజిరెడ్డి తీశాడు. ఆ సినిమా క‌థ ముందుగా స‌మంత‌కు చెప్పాడట ద‌ర్శ‌కుడు. ఈ క‌థ చాలా బాగుంది నేను చేస్తాన‌ని అని కూడా చెప్పిందట‌. కానీ ఏవో కార‌ణాల‌వ‌ల్ల ఆమె చేయ‌లేక‌పోయింది. ఈ విష‌యాన్ని జాంజిరెడ్డి ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లో భాగంగా స‌మంత చీఫ్‌గెస్ట్‌గా హాజరై చెప్పింది. ఈసినిమాకు సీక్వెల్‌గా తీయ‌వ‌చ్చ‌ని ఆమెనే చెప్పింది. 
 
ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడితో త‌దుప‌రి సినిమాలో నేను త‌ప్ప‌కుండా చేస్తాన‌ని స్టేట్‌మెంట్ ఇచ్చింది. అప్ప‌టినుంచి ప్ర‌శాంత్ వ‌ర్మ స‌మంత కోసం కొత్త‌క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు. క‌రోనా సెకండ్ వేవ్‌లోనే మంచి పాయింట్ త‌ట్టింద‌ట‌. అందుకే జాంబిరెడ్డికి సీక్వెల్ చేయ‌బోతున్నాడు. అయితే స‌మంత‌తో చేసే సినిమా ఇదే అయివుంటుంద‌ని క‌థ‌నాలు కూడా వినిపిస్తున్నాయి. స‌మంత లేడీ ఓరియెంటెడ్ త‌ర‌హా క‌థ‌కే ప్రాధ‌న్య‌త ఇస్తుంది. ఓబేబీ ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. అందులో న‌టించిన తేజ్‌, స‌మంత అమ్మ‌మ్మ మ‌న‌వ‌డుగా న‌టించారు. మ‌రి అలాంటి కాన్సెప్ట్‌తో మ‌రో క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లో దీనికి గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.లక్ష బహుమతి ఇస్తానంటున్న నిధి అగర్వాల్!