Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'థాంక్యూ ఆంటీ' అంటున్న గరుడవేగ హీరోయిన్... ఎవర్నీ?

డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించి తాజాగా రిలీజై మంచి విజయాన్ని నమోదుచేసిన చిత్రం "పీఎస్‌వీ గరుడవేగ". ప్రవీణ్‌సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్క‌గా శ్రద్దాదాస్, పూజాకుమార్ ఇందులో క‌థానాయిక‌లుగా న‌టిం

'థాంక్యూ ఆంటీ' అంటున్న గరుడవేగ హీరోయిన్... ఎవర్నీ?
, ఆదివారం, 12 నవంబరు 2017 (11:11 IST)
డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించి తాజాగా రిలీజై మంచి విజయాన్ని నమోదుచేసిన చిత్రం "పీఎస్‌వీ గరుడవేగ". ప్రవీణ్‌సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్క‌గా శ్రద్దాదాస్, పూజాకుమార్ ఇందులో క‌థానాయిక‌లుగా న‌టించారు. ఈ మూవీ విడుదలైన అన్ని థియేటర్లలో సక్సెస్‌ఫుల్ టాక్‌తో ప్రదర్శితమవుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 
 
అయితే, ఈ చిత్రంలో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రిపై టాలీవుడ్ ప్రముఖులు ప్ర‌శంస‌ల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవ‌ల ఓట‌మెరుగ‌ని దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సైతం ఈ చిత్ర బృందంపై ప్ర‌శంస‌లు కురిపించారుడు. ఇక రీసెంట్‌గా 'బాహుబ‌లి' సినిమాతో ఇండియ‌న్ స్టార్‌గా మారిన బాహుబ‌లి ప్ర‌భాస్ త‌ల్లి గ‌రుడ‌వేగ చిత్ర హీరోయిన్ పూజా కుమార్‌ని అభినందించార‌ట‌. 
 
కొన్ని ఎపిసోడ్స్‌‍లో హార్ట్‌ని టచ్ చేసేలా యాక్టింగ్ చేసిందని ప్రశంస‌లు కురిపించార‌ట‌. ఫోన్ చేసి మ‌రీ ఈ అమ్మ‌డిని అభినందించ‌డంతో ఆ ఆనందం త‌ట్టుకోలేక ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని త‌న అభిమానుల‌తో షేర్ చేసుకుంది పూజా. అంతేకాకుండా ప్ర‌భాస్ త‌ల్లికి థ్యాంక్యూ ఆంటీ అంటూ ధ‌న్యవాదాలు తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్ ముదురు హీరోకి మలయాళీ భామని ఫిక్స్?