Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్ర‌భాస్ లేటెస్ట్ మూవీ కోసం అన్ని సెట్స్ వేస్తున్నారా..?

ప్ర‌భాస్ లేటెస్ట్ మూవీ కోసం అన్ని సెట్స్ వేస్తున్నారా..?
, శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (19:52 IST)
బాహుబ‌లి ప్ర‌భాస్ సాహో సినిమాతో ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాపై ఎన్నో అంచ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో నిరాశ‌ప‌డిన అభిమానులు ప్ర‌భాస్ త‌దుప‌రి చిత్రం పైనే ఆశ‌లు పెట్టుకున్నారు. 
 
జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్‌తో ప్ర‌భాస్ ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీని గోపీకృష్ణా మూవీస్, యు.వి.క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీని 180 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించనున్నట్టు సమాచారం. 
 
1960 కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం దాదాపు 25 సెట్స్ నిర్మించినట్టు తెలిసింది. ప్రతి సెట్ కూడా అద్భుతంగా ఉందంటున్నారు. హైదరాబాద్ లోనే ఈ సెట్స్ వేశారు. ఇప్ప‌టివ‌ర‌కు 30 శాతం షూటింగ్ పూర్తైంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రెస్ట్ తీసుకుంటున్నారు. త్వ‌ర‌లోనే కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొంటార‌ట‌.
 
అయితే... 25 సెట్స్ వేస్తున్నార‌నేది హాట్ టాపిక్ అయ్యింది. ఈ సెట్స్ అన్నింటినీ హైద‌రాబాద్ లోనే వేస్తుండ‌డం విశేషం. సాహో ఆక‌ట్టుకోలేక‌పోయినా... ప్ర‌భాస్ కొత్త సినిమా బ‌డ్జెట్ విష‌యంలో మాత్రం రాజీప‌డ‌డం లేద‌ట‌. ఇంకా చెప్పాలంటే.... విజువ‌ల్ వండ‌ర్ అనేలా ఈ సినిమాని రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌. ప్ర‌భాస్ అభిమానులు ఆశ‌లు అన్నీ ఈ సినిమా పైనే. మ‌రి...ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ఏం చేస్తాడో?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ టైమ్‌లో నాగ్ ఆ.. ప్ర‌యోగం చేస్తున్నారా..?