Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్‌ఎక్స్ 100 భామపై కేసు.. ఎందుకు?

Advertiesment
ఆర్‌ఎక్స్ 100 భామపై కేసు.. ఎందుకు?
, శనివారం, 21 ఆగస్టు 2021 (10:32 IST)
ఆర్‌ఎక్స్ 100 సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్‌పై కేసు నమోదైంది. ఇక తను నటించిన మొదటి సినిమాతోనే.. సక్సెస్ సాధించుకుంది ఈమె. అయితే సినిమాలో ఎంతో హాట్గా కనిపించిన ఈ భామ. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కూడా నటించిన ఆశించిన ఫలితాలు లభించలేదు. అయితే ఈమె పై ప్రస్తుతం ఒక కేసు ఫైల్ అయినట్లు తెలుస్తోంది. ఆ విషయాలను చూద్దాం.
 
గత నెల 11న పెద్దపల్లి పట్టణంలో ఒక షాపింగ్ మాల్ ను చేసేందుకు.. పాయల్ అక్కడికి వెళ్ళింది.అయితే అదే కార్యక్రమంలో పాల్గొన్న ఈమె మాస్కు పెట్టుకోకుండా వచ్చింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలను..పాటించకపోవడంతో ఈమె పై పెద్దపల్లికి చెందిన బొంకూరి సంతోష్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ హీరోయిన్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. మరి ఈ కేసుపై ఈమె ఎలా స్పందిస్తుందో అనే విషయం పై వేచి చూడాలి.
 
ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ ఇలాంటి కేసులలో చిక్కు కోవడం వల్ల ఈమెపై ప్రేక్షకులు మండి పడుతున్నారు. ప్రజలకి చెప్పాల్సింది మీరే కాకుండా ఇలాంటివి చేస్తే ఎలా అని కొంత మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 
ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ ఆది సరసన ఒక సినిమాలో నటిస్తున్నది. అంతేకాకుండా ఆది తోనే మరొక సినిమాను కూడా త్వరలో చేయబోతున్నట్లు వారి ప్రకటించారు. ఇక ఈమె పై పెట్టిన కేసుతో కొంతమంది హీరోయిన్లు అలర్ట్ అయినట్లు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇక ఎక్కడికైనా ఓపెనింగ్స్ కి వెళ్ళిన, ఫంక్షన్లకు వెళ్లిన ఖచ్చితంగా మస్క్ పెట్టుకుని వెళ్లాలని కొంత మంది సినీ ప్రముఖులు నిర్ణయించుకున్నారట. ఇదే విషయం వారి మీద రిపీట్ కాకుండా ఉండేందుకు ఆలోచిస్తున్నారు సినీ ప్రముఖులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలా చేసిన త‌ర్వాతే ఇద్దరం పెళ్లి చేసుకుంటాంః రేష్మి, సుధీర్