Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

షూటింగ్ పూర్తి చేసుకున్న పింకీ ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో విడుద‌ల‌

Pinky team

డీవీ

, శుక్రవారం, 5 జనవరి 2024 (13:47 IST)
Pinky team
కిర‌ణ్‌, మౌర్యాణి జంట‌గా సుమ‌న్, శుభ‌లేఖ సుధాక‌ర్, ర‌వి అట్లూరి ప్ర‌ధాన పాత్ర‌ల్లో  న‌టిస్తోన్న చిత్రం పింకీ. సీర‌పు ర‌వి కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌సుపులేటి వెంక‌ట ర‌మ‌ణ నిర్మిస్తోన్న ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో గ్రాండ్ గా విడ‌దుల‌కు సిద్ద‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌స‌న్న కుమార్, తుమ్మ‌ల‌ప‌ల్లి రామ స‌త్య‌నారాయ‌ణ‌, సాయి  వెంక‌ట్ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
 
`జ‌నం, జ‌రిగిన క‌థ చిత్రాలు చేసిన ద‌ర్శ‌క నిర్మాత ప‌సుపులేటి వెంక‌ట ర‌మ‌ణ గారు. ఆయ‌న ద‌ర్శ‌కుడు అయ్యుండి మ‌రో ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇవ్వ‌డం గొప్ప విష‌యం. త‌న  నిర్మాణంలో వ‌స్తోన్న ఈ పింకీ చిత్రం ఘ‌న విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నా` అన్నారు  నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ స‌త్య‌నారాయ‌ణ. 
 
మ‌రో అతిథి సాయి వెంక‌ట్ మాట్లాడుతూ..`ఈ మ‌ధ్యే వెంక‌ట ర‌మ‌ణ గారు జ‌నం అనే సినిమాతో విజ‌యం సాధించారు. ఆయ‌న ద‌ర్శ‌కుడు అయినా కూడా మ‌రో ద‌ర్శ‌కుణ్ని ఎంక‌రేజ్ చేస్తూ పింకీ సినిమా చేయ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌యం.  సుమ‌న్ గారు విభిన్న‌మైన పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు పోస్ట‌ర్ చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రం టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు` అన్నారు.
 న‌టుడు ర‌వి అట్లూరి మాట్లాడుతూ..ఈ చిత్రంలో  సీనియ‌ర్ ఆర్టిస్ట్ చేయాల్సిన పాత్ర ఇచ్చిన‌న్ను  ప్రోత్స‌హించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు` అన్నారు.
 
 హీరో కిర‌ణ్ మాట్లాడుతూ, దర్శ‌కుడు అద్భుతంగా తెర‌కెక్కించారు సినిమా. ఈ సినిమా విడుద‌ల‌కోసం ఆతృత‌గా ఎదురు  చూస్తున్నా` అన్నారు.
ద‌ర్శ‌కుడు సీర‌పు ర‌వి కుమార్ మాట్లాడుతూ, `ఇది నా మొద‌టి సినిమా. నిర్మాత ఎక్క‌డా రాజీ పడ‌కుండా సినిమా బాగా రావ‌డానికి స‌హ‌క‌రించారు.  ఒక డైమండ్ కోసం జ‌రిగే అన్వేష‌ణే ఈ చిత్రం. ఫ్యామిలీ అండ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్` అన్నారు.
 
నిర్మాత ప‌సుపులేటి వెంక‌ట ర‌మ‌ణ మాట్లాడుతూ..`1980 లోమ‌ద్రాసు వెళ్లి అక్క‌డ ప్ర‌ముఖుల‌తో ప‌ని చేశాను.  ఆ త‌ర్వాత జ‌రిగిన క‌థ‌, జ‌నం చిత్రాలు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో  నిర్మించాను. వాటికి మంచి పేరొచ్చింది. ఆద‌ర్శ భావాల‌తో ఆ రెండు చిత్రాలు చేశాను. ప్ర‌జంట్  జ‌నం పార్ట్ 2  షూటింగ్ లో  ఉంది. సీర‌పు ర‌వి కుమార్  చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో `పింకీ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నా. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. సెన్సార్ ప‌నులు జ‌రుగుతున్నాయి.  ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ద‌ర్శ‌కుడు అన్నీ తానై ఈ చిత్రాన్ని రూపొందించాడు`` అన్నారు.
 
ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ సెక్ర‌ట‌రీ ప్ర‌స‌న్న కుమార్ మాట్లాడుతూ...`` పింకీ టైటిల్ తో వివిధ భాషల్లోవ‌చ్చిన చిత్రాలన్నీ ఘ‌న విజ‌యం సాధించాయి. ఎన్నో అవార్డ్స్ అందుకున్నాయి. అలాంటి క్యాచీ టైటిల్ తో వ‌స్తోన్న ఈ చిత్రం కూడా మంచి స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నా.  వెంక‌ట ర‌మ‌ణ గారు వ‌రుస‌గా చిత్రాలు చేస్తూ..ఓ  కొత్త ద‌ర్శ‌కుడి అవ‌కాశం క‌ల్పిస్తూ ఈ సినిమా చేయ‌డం మెచ్చుకోవాల్సిన  విష‌యం. కొత్త వారికి అవ‌కాశాలు క‌ల్పిస్తూ చేసే చిత్రాల‌ను ఆద‌రిస్తే ఇంకా ఎంతో మందికి అవ‌కాశాలు వ‌స్తాయి. ర‌వికుమార్ ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ చిత్రం చేసిన‌ట్లు పోస్ట‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంద  అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్రివిక్రమ్‌కు ఇదేం కొత్త కాదు... పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్స్