'సర్దార్ గబ్బర్సింగ్' తర్వాత పవన్కళ్యాణ్ నటించనున్న తాజా చిత్రం సెట్పైకి వెళ్ళనుంది. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమయిన ఈ చిత్రానికి ఎస్జె సూర్య దర్శకుడు. శ్రుతిహాసన్ జోడీగా నటించనున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
శరత్మరార్ నిర్మించనున్న ఈ చిత్రం ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. బాణీలుకూడా కొలిక్కి వచ్చాయి. ఈ నెలాఖరులో పొల్లాచ్చిలో రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. కోయంబత్తూరు సమీపంలోని పొల్లాచ్చి కొబ్బరి చెట్లతో కూడిన పంటపొలాల్లో ఈ సినిమా షూటింగ్ తెరకెక్కనుంది. గబ్బర్ సింగ్ తర్వాత హిట్కు నోచుకోలేని పవన్ కల్యాణ్.. తిరిగి ఖుషీ దర్శకుడితో జతకట్టడం ద్వారా బంపర్ హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు.