Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మేకప్ వేసుకునేందుకు సిద్ధమవుతున్న 'అజ్ఞాతవసి'

మేకప్ వేసుకునేందుకు సిద్ధమవుతున్న 'అజ్ఞాతవసి'
, మంగళవారం, 14 జనవరి 2020 (10:45 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి రాజకీయాలకు పరిమితమైన తర్వాత వెండితెరకు దూరమయ్యాడు. ముఖ్యంగా, "అజ్ఞాతవాసి" చిత్రం తర్వాత ఆయన మేకప్ వేసుకోలేదు. దీనికి కారణం రాజకీయాల్లో పూర్తిస్థాయిలో నిమగ్నంకావడం వల్లే. అయితే, ఇపుడు మళ్లీ మేకప్ వేసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. బాలీవుడ్ చిత్రం పింక్ రిమేక్ చిత్రంతో పాటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ సినిమాలు చేయ‌నున్నాడ‌నే వార్తలు వచ్చాయి. ఇవి ఇపుడు నిజం కానున్నాయట.
 
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ నటించేందుకు సమ్మతించారట. పైగా, ఈ చిత్రం షూటింగ్ కోసం పది రోజుల కాల్షీట్స్‌ను కూడా కేటాయించినట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ చిత్రం ఈనెల 20వ తేదీన 20న సెట్స్‌పైకి వెళ్ళ‌నుంది. ఫిబ్ర‌వ‌రిలో ప‌వ‌న్ టీంతో జాయిన్ కానున్నాడ‌ని, కేవ‌లం ప‌ది రోజులు మాత్ర‌మే ఆయ‌న ఈ చిత్రానికి కాల్షీట్స్ ఇచ్చాడ‌ని అంటున్నారు. 
 
ఇకపోతే, ఇక మ‌ణిర‌త్నం నిర్మాణంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా క్రిష్ తెర‌కెక్కించే సినిమా కూడా పింక్‌తో సమాంత‌రంగా షూటింగ్ జ‌రుపుకుంటుంద‌ట‌. ఈ చిత్రానికి కూడా ప‌వ‌న్ 10 రోజుల కాల్షీట్స్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. ఈ రెండు సినిమాల‌కి క‌లుపుకొని దాదాపు వంద కోట్ల‌కి పైగా రెమ్యున‌రేష‌న్ ప‌వ‌న్ అందుకోనున్నాడ‌ని విశ్వ‌న‌య వ‌ర్గాల స‌మాచారంగా తెలుస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మన్మథుడు నాగ్‌కు ఎన్ని కష్టాలొచ్చాయి..?