Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ దొం.... కొడుకు... లం.. చేసే పనులన్నీ చేస్తాడు : వైకాపా ఎమ్మెల్యే

పవన్ దొం.... కొడుకు... లం.. చేసే పనులన్నీ చేస్తాడు : వైకాపా ఎమ్మెల్యే
, శనివారం, 11 జనవరి 2020 (17:25 IST)
అధికార వైకాపాకు చెందిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రెచ్చిపోయారు. నోటికి ఇష్టమొచ్చినట్టు బూతులు మాట్లాడారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యణ్‌లను లం... కొడుకులు అంటూ సంబోధించాడు. అంతేకాకుండా, పప్పు లోకేశ్‌కు కూడా కొవ్వు కరిగేలా బుద్ధి చెప్పాలంటూ వైకాపా శ్రేణులకు పిలుపునిచ్చారు. 
 
ఆయన శనివారం స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఓపెన్ టాపు జీపులో ప్రచారం చేస్తూ వైకాపా శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇందులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రసంగిస్తూ, చంద్రబాబు తన బినామీల కోసం బస్సు యాత్ర చేపడుతున్నారు. 
 
చంద్రబాబుని లంజా కొడకా, వెధవ అని తిట్టాలని ఉంది. మొన్న ఎన్నికల్లో చంద్రబాబుకి సరైన బుద్ధి చెప్తాం. ఆ ముసలాడు మళ్లీ లేవకూడదు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగా పని చేయాలి. గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన వెధవ పనులన్నీ ప్రజలకు తెలియజెప్పాలి. చంద్రబాబు కొడుకు పప్పు లోకేష్ కూడా కొవ్వు కరిగేలా బుద్ధి చెప్పాలి.
 
పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్. చంద్రబాబు చెప్పుచేతల్లో నడిచే నువ్వు కూడా ఒక నాయకుడివేనా? పవన్ కళ్యాణ్ ఒక దొంగనా కొడుకు. లంజ చేసే పనులన్నీ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. అసలు రాజధానిని వెంటనే విశాఖకు తరలించాలి. అమరావతిలో బినామీలను బయటకు తేవాలి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను జైల్లో వేయాలి అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ ప్రసంగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ రాజధానిగా అమరావతే: బీజేపీ రాష్ట్ర శాఖ తీర్మానం