Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్ చరణ్ ఆవిష్క‌రించిన పరంపర 2 వెబ్ సిరీస్ ట్రైలర్

Advertiesment
Parampara 2 poster
, శుక్రవారం, 8 జులై 2022 (17:07 IST)
Parampara 2 poster
డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ 'పరంపర' సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది. ఈ వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. ఈ కొత్త సిరీస్ ఈ నెల 21 తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను స్టార్ హీరో రామ్ చరణ్ విడుదల చేశారు. పరంపర 2 ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని ట్వీట్ చేసిన రామ్ చరణ్, టీమ్ అందరికీ బెస్ట్ విశెస్ తెలిపారు.
 
ట్రైలర్ చూస్తే ఇంటెన్స్ పొలిటికల్ డ్రామాగా పరంపరం 2 వెబ్ సిరీస్ ఉండబోతోందని తెలుస్తోంది. ఈ యుద్ధం ఎవరి కోసం మొదలుపెట్టావో గుర్తుంది కానీ ఎందుకోసం మొదలుపెట్టావో గుర్తు లేదు అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఫ్రీడమ్ కోసం, మా నాన్న దగ్గర లాకున్న అధికారం కోసం, పోగొట్టుకున్న పేరు, కోల్పోయిన జీవితం అన్నీ తిరిగి కావాలి అంటూ నవీన్ చంద్ర చెప్పిన డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్ పాత్రల మధ్య  హోరాహోరి ఘర్షణ ఆకట్టుకుంటోంది. ఓ రియల్ రివేంజ్ యాక్షన్ డ్రామా ట్రైలర్ లో ఆవిష్కృతమైంది. మూడు జెనరేషన్స్ కి సంబంధించిన కథతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. స్ట్రాంగ్ ఎమోషన్స్ తో సెకండ్ సీజన్ ఆకట్టుకుంటుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. జూలై 21 నుంచి 'పరంపర' సీజన్ 2 స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జిన్నా ప్రీ లుక్ క్యూరియాసిటీని పెంచుతుంది