టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓకే అంటే ఆయనతో ప్రేమాయణానికి రెడీ అని బాలీవుడ్ స్టార్ రాఖీ సావంత్ ప్రకటించిన నేపథ్యంలో.. తాజాగా కోహ్లీని అభిమానించే సెలెబ్రిటీల్లో మరో బాలీవుడ్ బ్యూటీ కుడా చేరిపోయింది. ఆ భామే ప్రాచీ దేశాయ్. విరాట్ కోహ్లీపై మనసు పారేసుకున్నానని.. కోహ్లీతో డేటింగ్ వెళ్లాలనుందని చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రాచీ దేశాయ్ కామెంట్సే బిటౌన్లో చర్చనీయాంశమైంది.
ఇప్పటికే అనుష్క రెండేళ్లుగా విరాట్ కోహ్లీతో డేటింగ్ చేసి.. ఈ మధ్యే విడిపోయి మళ్లీ ఒక్కటైనట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుష్క ఏమనుకున్నా తన అభిప్రాయం ఇదేనని ప్రాచీ దేశాయ్ చెబుతుంది. ప్రాచీ నటించిన తాజా చిత్రం 'అజర్' ప్రచార కార్యక్రమంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మరో హీరోయిన్ నర్గీస్ ఫక్రీ మాత్రం తనకు సచిన్ అంటే ఇష్టమని.. అతనితో కలసి డిన్నర్ చేయాలని ఉందని తన మనసులోని మాటను బయట చెప్పింది.