Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిత్యా మీనన్‌పై మనసుపడిన బీమ్లా నాయక్‌

నిత్యా మీనన్‌పై మనసుపడిన బీమ్లా నాయక్‌
, శుక్రవారం, 30 జులై 2021 (10:43 IST)
పవర్ స్టార్ పవన కళ్యాణ్, దగ్గుబాటి రానాల కాంబినేషన్‌లో రానున్న చిత్రంలో నిత్యా మీనన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. మలయాళ మూవీ 'అయ్యప్పనుం కోషియం'ను తెలుగులోకి రీమేక్ చేస్తుండగా, ఇందులో ఈ ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటిస్తున్నారు. 
 
అయితే, ఈ సినిమాలో పవన్‌కి జంటగా నటిస్తున్న టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయినట్టు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 
 
పవర్ స్టార్ మరోసారి బీమ్లా నాయక్ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. రీసెంట్‌గా ఏకే రీమేక్ నుంచి మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేసింది చిత్ర బృందం. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ రివీల్ చేయడంతో అంచనాలు బాగా పెరిగాయి. ప్రస్తుతం ఈ వీడియో ట్రండ్ అవుతోంది. 
 
ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తుండటం విశేషం. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 'భీమ్లా నాయక్' అనే పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో పవర్ స్టార్ నటిస్తున్నాడు. ఆయనకి జంటగా నిత్యా మీనన్ నటిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్ - ఆస్పత్రిలో చేరిక