Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ - గోపీచంద్ కాంబినేషన్లో మల్టీస్టారర్..?

పవన్ - గోపీచంద్ కాంబినేషన్లో మల్టీస్టారర్..?
, బుధవారం, 18 నవంబరు 2020 (18:41 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీ చేస్తున్నారు. క్రిష్ డైరెక్షన్లో పిరియాడిక్ మూవీ చేస్తున్నారు. అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ మూవీ, సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే... వైల్డ్ కార్డ్ ఎంట్రీలా ఈ సినిమాల మద్యలో అయ్యప్పను్ కోషియమ్ మూవీ రీమేక్‌కి ఓకే చెప్పారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది.
 
యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తుండడం విశేషం. 
 
అయితే... ఇందులో పవన్ కళ్యాణ్‌తో పాటు వేరే హీరో క్యారెక్టర్ కూడా ఉంటుంది. దీనికి దగ్గుబాటి రానాను అనుకున్నారు. దాదాపు రానా కన్ఫర్మ్ అనుకుంటే... ఇంకా అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయలేదు.
 
ఇదే విషయం గురించి రానాని అడిగితే.... తనని కాంటాక్ట్ చేసిన విషయం వాస్తవమే కానీ... ఇంకా ఈ సినిమాలో నటించాలా వద్దా అనే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పారు. ఇదిలా ఉంటే... ఇప్పుడు రానా చేయాల్సిన పాత్రను హీరో గోపీచంద్‌తో చేయిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట.
 
 నెగిటివ్ టచ్ ఉండే ఈ క్యారెక్టర్ చేయడానికి గోపీచంద్ రెడీగా ఉన్నారట. ప్రస్తుతం గోపీచంద్ సిటీమార్ అనే యాక్షన్ మూవీ చేస్తున్నారు. మరి... గోపీచంద్ ఈ మూవీ చేస్తడా..? అసలు ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? అనేది తెలియాల్సివుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరుత కాంబినేషన్లో మూవీ నిజమేనా..?