Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రభాస్ "రాధేశ్యామ్" లేటెస్ట్ అప్‍డేట్స్ ఏంటి? 1000 మందితో 100 రోజులు...

ప్రభాస్
, బుధవారం, 9 డిశెంబరు 2020 (14:59 IST)
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. సాహో తర్వాత పలు చిత్రాల్లో నటించేందుకు కమిట్ అయ్యారు. ఇలాంటి చిత్రాల్లో ఒకటి రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
 
ఇందులోభాగంగా, ఒక కీలకమైన భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తాజాగా హైదరాబాదులో చిత్రీకరించారు. నెల రోజుల పాటు జరిగిన షెడ్యూల్‌లో ప్రభాస్, ఫైటర్లు, ఇతర తారాగణంపై దీనిని భారీ ఎత్తున చిత్రీకరించడం జరిగింది.
 
దీనిపై దర్శకుడు స్పందిస్తూ, ''నా రెండేళ్ల స్వప్నాన్ని నెలరోజుల పాటు సాగిన యాక్షన్ షెడ్యూలులో సాకారం చేయడానికి 1000 మంది 100 రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారు. ఈ సందర్భంగా.. గతంలో ఎన్నడూ చూడని ఈ అడ్వెంచర్‌ని ఆవిష్కరించిన మా యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్‌కి, అతని బృందానికి మా టీమ్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు.
 
ఇదిలావుంచితే, ఈ చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూళ్ల షూటింగును గతంలో జార్జియా, ఇటలీ దేశాలలో నిర్వహించిన సంగతి విదితమే. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా ఒకేసారి విడుదల చేస్తారు. ఇటీవల పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తోపాటు టైటిల్ థీమ్‌ను రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'సిల్క్ స్మిత'గా నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన అనసూయ