Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోతన మాటకు నిలువెత్తు నిదర్శనం మా బావ వైఎస్ఆర్ : మోహన్ బాబు

పోతన మాటకు నిలువెత్తు నిదర్శనం మా బావ వైఎస్ఆర్ : మోహన్ బాబు
, బుధవారం, 8 జులై 2020 (15:43 IST)
ప్రజానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని పలువురు సెలెబ్రిటీలు ఆయనకు నివాళులు అర్పించారు. అలాంటి వారిలో సినీ హీరో డాక్టర్ మోహన్ బాబు కూడా ఒకరు. ఆయన తన మనసులోని మాటను ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
వైఎస్సార్ స్నేహశీలి అంటూ కొనియాడారు. 'మాట తప్పలేరు మానధనులు' అన్న పోతన మాటకు వైఎస్సార్ నిలువెత్తు నిదర్శనం అంటూ అభివర్ణించారు.
 
"పేద ప్రజల దైవం మా బావగారైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నా" అంటూ మోహన్ బాబు స్పందించారు. 
 
అలాగే, ప్రముఖ సినీ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా తన నివాళులు ట్విట్టర్ ద్వారా అర్పించారు. "విలక్షణ రాజకీయచతురుడు, అవసరంలో వున్నవాళ్లకు అభయదాత, రైతన్నలకు ఆపద్భాంధవుడు పౌరుషానికి ప్రతినిధి , నిరుపేదల పాలిట ప్రత్యక్షదైవం, రాజకీయం అంటే వాగ్దానం చెయ్యడం కాదు, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం అని భావితరాలకు నేర్పిన ప్రజల ముఖ్యమంత్రి డా రాజశేఖరరెడ్డిగారి జయంతి నేడు. వందనాలు మహానుభావా" అంటూ ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిర్మాతగా మారనున్న చిరంజీవి డాటర్.. చెర్రీకి పోటీ తప్పదా?