Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

Advertiesment
Nellore - Manchu laxmi

దేవీ

, మంగళవారం, 22 జులై 2025 (17:50 IST)
Nellore - Manchu laxmi
టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ద్వారా నెల్లూరు జిల్లాలోని 12 పాఠశాలలలో డిజిటల్ క్లాస్ రూమ్ ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగిందని ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి వెల్లడించారు. నెల్లూరు నగరంలోని కోటమిట్ట కృష్ణ మందిరం వీధిలోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ నందు మాజీ మంత్రి, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,కోడలు శృతి రెడ్డిలతో కలిసి డిజిటల్ క్లాస్ రూమ్ లను ప్రారంభించి..అక్కడి విద్యార్థులతో మమేకమై ఉన్నత విద్యకు తగిన ప్రాముఖ్యతను వివరించారు. 
 
ప్రైవేట్ పాఠశాల విద్యకు ప్రభుత్వ పాఠశాలల విద్యకు వ్యత్యాసం కనిపిస్తుండడంతో.. ఆ వ్యత్యాసాన్ని తొలగించడమే లక్ష్యంగా తమ ఎన్జీవో సంస్థ ద్వారా విశేష కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.ఇప్పటికే 12 పాఠశాలలలోనూ డిజిటల్ క్లాస్ రూమ్ ల ఏర్పాటు పూర్తయిందన్నారు.ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరాలన్నదే తన ఆకాంక్ష అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Deverakonda: తిరుపతిలో దేవరకొండ కింగ్‌డమ్ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్