మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్ మెగా ఆఫర్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలో మాళవికను హీరోయిన్గా ఎంపిక చేశారు. చిరంజీవి - బాబి కాంబినేషన్లో గతంలో "వాల్తేరు వీరయ్య" వంటి సూపర్ హిట్ మూవీ వచ్చింది. ఇపుడు మరోమారు ఇదే కాంబోలో మరో సినిమా రానుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 'మిరాయ్' చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్గా పని చేయనున్నారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించగా, నవంబరు 5వ తేదీన పూజా కార్యక్రమాలతో లాంఛనాలతో ప్రారంభించనున్నట్టు చిత్రవర్గాల సమాచారం.
ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్గా మాళవికా మోహనన్ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈమె గతంలో 'మాస్టర్', 'తంగలాన్' తమిళ చిత్రాల్లో నటించారు. ఇపుడు తెలుగులో ప్రభాస్ తరపున "రాజాసాబ్" మూవీలో నటించనున్నారు. ఇపుడు మెగాస్టార్తో జతకట్టే గోల్డెన్ ఛాన్స్ను కొట్టేసిది.