Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహేష్ ఫ్యాన్స్ గుడ్‌న్యూస్..!

మహేష్ ఫ్యాన్స్ గుడ్‌న్యూస్..!
, శనివారం, 23 మార్చి 2019 (17:09 IST)
మహేష్ బాబు 25 చిత్రం 'మహర్షి'. ఇందులో మహేష్ బాబు కాలేజీ స్టూడెంట్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ తరువాత మహేష్ నటిస్తున్న సినిమా మహర్షి కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేష్ జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు.
 
టాలీవుడ్ టాప్ నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించగా.. 1 నేనొక్కడినే, శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి చిత్రాలతో మహేష్‌కి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ మహర్షి చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. మే 9వ తేదీన మహర్షి విడుదల చేయడానికి సన్నాహాలు సాగిస్తున్నారని దేవి శ్రీ ప్రసాద్ మహేష్ ఫ్యాన్స్ గుడ్‌న్యూస్ అందించారు. 
 
మహర్షి చిత్రం ఫస్ట్‌సాంగ్‌ను మార్చి 29వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. మహేష్ కూతురు సితారతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల సితార బాహుబలి పాటకు డాన్స్ చేస్తూ మహేష్ ఫ్యాన్సును థ్రిల్ చేసిన విషయం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ‌ర్మ‌కు షాక్ ఇచ్చిన నితిన్..!