Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'గీత గోవిందం' దర్శకుడితో మహేష్...

'గీత గోవిందం' దర్శకుడితో మహేష్...
, సోమవారం, 18 మార్చి 2019 (13:11 IST)
చేతులుకాలాక ఆకులు పట్టుకున్నట్లు... మహేష్ బాబు తన చేసిన 'బ్రహ్మోత్సవం', 'స్పైడర్' సినిమాలు ప్లాప్ అయిన తర్వాత తనతో సినిమా చేయాలనుకునే దర్శకులు ఎవరైనా పూర్తి స్క్రిప్టుతో వచ్చి, అది తనకు నచ్చితేనే సినిమా చేసేందుకు మహేష్ ఓకే చేస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. తన చేయబోయే సినిమా విషయంలో మహేష్ పాటిస్తున్న కఠిన నిబంధన ఇది. 
 
ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' చేస్తున్న మహేష్‌కి... దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా ఓకే అయింది. ఈ సంవత్సరం చివరి వరకు సినిమా పూర్తిచేసి వచ్చే యేడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది అనిల్ ప్లాన్. ఈ రెండింటి తర్వాత ఏ సినిమా చేస్తారు అనే విషయంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. 
 
రాజమౌళి దర్శకత్వంలో సినిమా ఉంటుందనే వార్తలు వచ్చినప్పటికీ... అవి ఎంతవరకు నిజమో తెలియదు. అయితే తాజాగా 'గీతగోవిందం' దర్శకుడు పరశురామ్ రీసెంట్‌గా మహేష్ బాబును కలిసి ఓ లైన్ వినిపించాడట. లైన్ బాగుంది డెవలప్ చేయమని చెప్పినట్టు తెలుస్తోంది. 
 
లైన్ డెవలప్ చేసి పూర్తి స్క్రిప్టుతో వచ్చి మహేష్‌ను మెప్పిస్తే.. సినిమా చేసే అవకాశం వస్తుంది. లేదంటే.. లేనట్టే. ఒకవేళ పరశురామ్ మహేష్‌ను ఒప్పించగలిగితే.. ఈ సెన్సేషనల్ జోడీ మరో సూపర్ హిట్ ఇవ్వనున్నారో... మొత్తం మీద ఏం జరగనుందో వేచి చూద్దాం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పట్లో హిట్ ఇచ్చాడు... మళ్లీ అదే ఆశతో యంగ్ హీరో