Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుష్ప సెట్‌లో జానీ కొట్టాడు.. పవన్ అందుకే కామ్‌గా వున్నాడు.. మాధవీలత

Madhavilatha

సెల్వి

, మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (13:46 IST)
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంపై సినీ నటి మాధవీలత స్పందించింది. జానీ మాస్టర్ తన అసిస్టెంట్‌ను మైనర్‌గా ఉన్న టైంలోనే లొంగదీసుకున్నాడని, పెళ్లి, మత మార్పిడి అంటూ ఆమెను వేధించాడని మాధవీ లత ఆరోపించింది. 
 
బాధితురాలు అతనికి దూరం కావాలనుకున్నా వదల్లేదని.. తనంతట తాను బతికేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని మాధవీలత వెల్లడించింది. ఇక ఆమెకు మిస్ యూ, లవ్యూ, మ్యారీ మీ అంటూ వందల, వేల మెసెజ్‌లు పెట్టి టార్చర్ చేశాడని తెలిపింది. 
 
పుష్ప 2 సెట్‌లో ఆమెను అందరి ముందే కొట్టాడు. సుకుమార్ పంచాయితీ పెట్టి అప్పుడు సెటిల్ చేశాడు. అన్ని విషయాలు అల్లు అర్జున్‌కి తెలుసు కాబట్టే ఆమెకు అండగా నిలిచి ఆఫర్ ఇస్తానని అన్నాడు. ఇండస్ట్రీలో చాలా విషయాలు తెలుసుకునే ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ పెట్టింది. 
 
అన్నీ తెలుసుకున్నాకే అతని మీద సస్పెన్షన్ వేటు వేసింది. ఇక నాగబాబు ఇలా జానీ మాస్టర్ కోసమే అన్నట్టుగా ట్వీట్లు వేయడం తనకు నచ్చలేదు అని మాధవీలత చెప్పుకొచ్చింది. ఆయనకు ఓ కూతురుందనే విషయం గుర్తు పెట్టుకోవాలని మాధవీలత పేర్కొంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు అంతా తెలుసు కాబట్టే కామ్‌‍గా వున్నారని మాధవీలత వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జానీ మాస్టర్ రేప్ చేసే నాటికి ఆమెకు 16 ఏళ్లే.. కస్టడీ తీసుకుంటారా?