Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

`మా`కు కాదు నాగ‌బాబుకే మ‌స‌క‌బారింది

`మా`కు కాదు నాగ‌బాబుకే మ‌స‌క‌బారింది
, శనివారం, 26 జూన్ 2021 (11:56 IST)
Nagababu-Naresh
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్ పోటీ చేస్తూ ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సీనియ‌ర్ న‌టుడు నాగ‌బాబు స్పందించిన తీరుప‌ట్ల సినీప్ర‌ముఖులు పెక్కుమంది ఆక్షేపించారు. ముఖ్యంగా `మా` ప్ర‌స్తుత అధ్య‌క్షుడు సీనియ‌ర్ న‌రేశ్ తీవ్రంగా ఖండించారు. నాగ‌బాబుగారు `మా` నాలుగేళ్ళ‌నుంచి మ‌స‌కబారింద‌ని పేర్కొన‌డం స‌రైందికాద‌ని అన్నారు.అలాగే  సీనియ‌ర్ నిర్మాత‌, న‌టుడు, ఛాంబ‌ర్‌లో ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్ త్రిపుర‌నేని చిట్టిబాబు కూడా నాగ‌బాబు మాట్లాడిన విధానం స‌రైంది కాద‌ని తేల్చిచెప్పారు.
 
శ‌నివారంనాడు సీనియ‌ర్ న‌రేశ్‌ తాను చేసిన ప‌నుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. నేను మా అధ్య‌క్షుడిగా వున్న‌ప్ప‌టినుంచి చేసిన సేవ‌ల‌ను నాగ‌బాబుకు చెబుతూనే వున్నాను. చాలాసార్లు క‌లిసి విన్న‌వించాం. బాగుంది అన్నారు. కానీ ఇప్పుడు మా మ‌స‌క‌బారింది అన‌డం ఆయ‌న విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నానంటూ సుతిమెత్తంగా వివ‌ర‌ణ ఇచ్చారు.
 
చిరంజీవిగారే మెచ్చుకున్నారు
క‌రోనా టైంలో ఎంతోమందికి సాయం చేశామంటూ న‌రేశ్‌ వివ‌రాల‌తో స‌హా విలేక‌రుల‌మందు వివ‌రించారు. అందులో చిరంజీవిగారి ఆధ్వ‌ర్యంలో సి.సి.సి ఏర్పాటైన‌ప్పుడు మా`` త‌ర‌ఫున కాకుండా నేను స్వంత‌గా లక్ష విరాళాన్ని అంద‌జేశాను. ఆ రోజు రాత్రి చిరంజీవిగారు ఫోన్ చేసి మీకు చాలా కృత‌జ్ఞ‌త‌లు అంటూ మాట్లాడారు. అలాగే మా చేస్తున్న సేవ‌లు అభినంద‌నీయ‌మ‌ని తెలిపారు. మ‌రి ఇవ‌న్నీ నాగ‌బాబుకూ తెలియ‌వా? అంటూ ప్ర‌శ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనూ, రామ్ చరణ్ ఓవర్.. భీష్మ బ్యూటీ కోసం 900 కిలోమీటర్లు?!