Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు హిట్ పాటల రచయిత గురుచరణ్ కన్నుమూత

Gurucharan

ఠాగూర్

, గురువారం, 12 సెప్టెంబరు 2024 (13:14 IST)
Gurucharan
తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ గేయ రచయిత గురుచరణ్ కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. ‘ముద్దబంతి పువ్వులో మూగబాసలు’, ‘కుంతీకుమారి తన నోరుజారి’, ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిలా’ వంటి అనేక సూపర్ హిట్ పాటలను గురుచరణ్ రచించారు. 
 
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్. గురుచరణ్ అలనాటి ప్రముఖ నటి ఎం.ఆర్.తిలకం, అలనాటి ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావుల కుమారుడు. ఎం.ఎ. చదివిన గురుచరణ్ ప్రముఖ గీత రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశారు. రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు. 
 
ముఖ్యంగా నటుడు మోహన్‌బాబుకు ఎంతో ఇష్టమైన పాటల రచయిత గురుచరణ్. మోహన్‌బాబు నటించిన చిత్రాలలో గురుచరణ్‌తో ఒక్క పాట అయినా తప్పకుండా రాయించేవారు. మోహన్ బాబు చిత్రాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్నో మెలోడీ, అర్థవంతమైన పాటలు గురుచరణ్ కలం నుంచి  వచ్చినవే కావడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలసట పోగొట్టుకోవడానికి సినిమాలే మార్గం: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు