Publish Date: Thu, 16 Dec 2021 (18:11 IST)
Updated Date: Thu, 16 Dec 2021 (18:12 IST)
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం లైగర్ నుంచి డబుల్ ధమాకా అప్డేట్ వచ్చేసింది. లైగర్ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 25న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించేశారు. ఇక రెండో అప్ డేట్ ఏంటంటే.. కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 31న లైగర్ నుంచి గ్లింప్స్ను విడుదల చేస్తున్నారు.
అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేయడంతో పాటు ఛార్మితో కలిసి పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్స్పై నిర్మిస్తున్నారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.
విజయ్ దేవరకొండను సరికొత్త లుక్, క్యారెక్టరైజేషన్తో పూరి తనదైన స్టైల్లో సిల్వర్ స్క్రీన్పై ప్రెజంట్ చేస్తున్నారు. పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఇలా మొత్తం యూనిట్కు లైగర్ తొలి పాన్ ఇండియా మూవీ. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. సినిమాపై భారీ అంచనాలున్నాయి.