Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మలయాళ నిర్మాత అజయ్ క్రిష్ణన్ ప్రియురాలి ఆత్మహత్య

Advertiesment
మలయాళ నిర్మాత అజయ్ క్రిష్ణన్ ప్రియురాలి ఆత్మహత్య
, శుక్రవారం, 6 మే 2016 (13:38 IST)
కోటి ఆశలతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నిర్మాత అజయ్ క్రిష్ణన్. అతని జీవితం అర్థాంతంగా ముగిసింది. గత నెల ఏప్రిల్ 25న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదాన్ని మరువక ముందే మరో విషాదం కూడా చోటుచేసుకుంది. అజయ్ క్రిష్ణన్ ప్రియురాలు వినితా నాయర్ కూడా ఆత్మహత్య చేసుకుంది. అజయ్ క్రిష్ణన్ మృతిని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఆమె సూసైడ్ నోట్‌లో తన చావుకు ఎవరూ కారణం కాదని వెల్లడించారు. 
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే అజయ్ క్రిష్ణన్ తన ఆస్థిని అమ్మీ కొన్ని చోట్ల అప్పులు చేసి మరీ ''అవరుడే రవుకల్'' అనే ఒక సినిమాను తీశాడు. ఎంతో కష్టపడి తీసిన సినిమా ప్రివ్యూను చూసి… ఇప్పటివరకు తాను పెట్టిన డబ్బు వృధా అని, ఈ సినిమా హిట్ అవ్వదని భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని మరణాన్ని జీర్ణించుకోలేని ప్రియురాలు వినీతా నాయర్ మంగళవారం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
ఎస్ఐ సతీష్ కుమార్ ఈ కేసు విషయమై పోలీసులతో మాట్లాడుతూ... వినీత నాయర్ సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని, అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉందని తెలిపారు. బెంగుళూరులో ఫ్యాషన్ డిజైనిగ్ కోర్సు పూర్తి చేసిన వినీతా నాయర్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అజయ్ లేడన్నబాధతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంట రాజేస్తే చాలు.. హ్యాపీగా స్మార్ట్ ఫోనుకు ఛార్జ్ పెట్టుకోవచ్చు!