Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి సేవలో 'కృష్ణార్జున యుద్ధం' చిత్ర టీం.. 12న మీ ముందుకొస్తామంటూ..

తిరుమల శ్రీవారి సేవలో "కృష్ణార్జున యుద్ధం" చిత్ర యూనిట్ పాల్గొంది. ఆదివారం ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

Advertiesment
Krishnarjuna Yuddham
, ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (12:49 IST)
తిరుమల శ్రీవారి సేవలో "కృష్ణార్జున యుద్ధం" చిత్ర యూనిట్ పాల్గొంది. ఆదివారం ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్నవారిలో ఆ చిత్ర హీరో నాని, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, చిత్రానికి చెందిన ఇతర సభ్యులు ఉన్నారు. 
 
కాగా, శనివారం తిరుపతిలో జరిగిన కృష్ణార్జునయుద్ధం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ కోసం ఈ చిత్ర బృందం వచ్చింది. ఈ కార్యక్రమం తర్వాత రాత్రికి అక్కడే బస చేసి ఆదివారం ఉదయం స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్ధప్రసాదాలు, పట్టువస్త్రాలను వారికి అందజేశారు. 
 
అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల మీడియాతో హీరో నాని మాట్లాడుతూ.. ఈనెల 12వ తేదీన చిత్రం విడుదల అవుతున్న సందర్భంగా సినిమా విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీకాంత్ "కాలా" ఇప్పట్లో విడుదల కాదు... ఎందుకో తెలుసా?