Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 27 April 2025
webdunia

సిరివెన్నెల చనిపోవడానికి కారణం ఏంటి? వెల్లడించిన కిమ్స్ వైద్యులు

Advertiesment
Sirivennela Sitarama Sastry
, బుధవారం, 1 డిశెంబరు 2021 (08:13 IST)
ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమించారు. మంగళవారం సాయంత్రం 4.07 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. నవంబరు 24వ తేదీన అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన... చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే, ఆయన మృతికి గల కారణాలను కిమ్స్ ఆస్పత్రి వైద్యులు వివరించారు. 
 
ఇదే అంశంపై ఆస్పత్రి ఎండీ భాస్కర్ రావు మాట్లాడుతూ, గత ఆరేళ్లుగా ఆయన ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఊపిరితిత్తుల ఆపరేషన్ చేసి కొంతభాగం తొలగించామన్నారు. పైగా బైపాస్ సర్జరీ కూడా చేసినట్టు చెప్పారు. 
 
వారం రోజుల క్రితం కూడా కేన్సర్ వస్తే అందులో కూడా సగం తీయాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత ఆయన రెండు రోజుల పాటు బాగానేవున్నారని చెప్పారు. కానీ, ఇంతలోనే కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, దీంతో అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్ కోసం కిమ్స్‌కు తీసుకొచ్చారన్నారు. 
 
కిమ్స్ ఆస్పత్రిలో రెండు రోజులు చికిత్స పొందిన తర్వాత ఆయన బాగానే ఉన్నారన్నారు. దీంతో ఆయనకు ప్రీకాస్టమీ చేశామనీ, 45 శాతం ఊపిరితి తిత్తులు తీసేశాసమని, మిగిలిన 55 శాతం ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకిందన్నారు. ఈ కారణంగా ఆయన్ను ఎక్మో మిషన్‌పై పెట్టామని, గత ఐదో రోజులుగా ఇదే తరహా చికిత్స చేస్తూ వచ్చామన్నారు. 
 
ఒకవైపు కేన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, కిడ్నీ డ్యామేజ్‌తో పాటు ఊబకాయం కూడా ఒక సమస్య కావడంతో శరీరమంతా ఇన్ఫెక్షన్ సోకిందన్నారు. వీటివల్లే సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిరివెన్నెల భౌతిక కాయానికి రేపు అంత్య‌క్రియ‌లు