Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కీర్తి సురేష్ 'మిస్ ఇండియా'... ఎప్పుడైంది? ఏంటి సంగతి?

కీర్తి సురేష్ 'మిస్ ఇండియా'... ఎప్పుడైంది? ఏంటి సంగతి?
, మంగళవారం, 27 ఆగస్టు 2019 (16:31 IST)
కీర్తి సురేష్ మిస్ ఇండియా ట్రెండింగులో నడుస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే... తెలుగులో ఇటీవల ‘మహానటి’ సినిమాతో అత్యద్భుమైన సక్సెస్‌తో పాటుగా కేంద్ర ప్రభుత్వ జాతీయ అవార్డు కూడా గెలుచుకున్న కీర్తి సురేష్, ప్రస్తుతం ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్నారు. కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తోన్న చిత్రానికి ‘మిస్ ఇండియా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 
 
ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌రేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్ నటిస్తున్న తెలుగు చిత్రమిదే. ఈ చిత్రం యూరప్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు.ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చుతుండగా, ఈ సినిమాతో నరేంద్ర టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 
 
సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేశ్, నదియా తోపాటు కమల్ కామరాజు, భానుశ్రీ మెహతా ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకి సంబంధించిన మేజర్ షెడ్యూల్ షూటింగు ఇటీవల విదేశాల్లోనే జరిగింది.
 
 నిర్మాత మ‌హేష్ కోనేరు మాట్లాడుతూ – “`మ‌హాన‌టి` చిత్రంతో కీర్తిసురేష్ తెలుగువారి హృద‌యాల్లో ఎంత‌టి స్థానం సంపాదించుకుందో తెలిసిందే. అలాగే ఉత్తమనటిగా జాతీయ అవార్డుని దక్కించుకుని మనకు గర్వకారణమయ్యారు. 
 
ఆమె జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం మా బ్యానర్‌లోనే కావడం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ చిత్రానికి ‘మిస్ ఇండియా’ అనే టైటిల్‌ను ఖరారు చేశాం. దాని లుక్‌ను విడుదల చేశాం. ఆమె నుండి ఇప్పుడు ప్రేక్షకులు ఎలాంటి సినిమా రావాలని కోరుకుంటారో అలాంటి సినిమానే ‘మిస్ ఇండియా’. ప్ర‌తి అమ్మాయి త‌న జీవితంలో ఎక్క‌డో ఒక‌చోట ఇలాంటి సిచ్యువేష‌న్‌ను ఎదుర్కొనే ఉంటుంది. మ‌హిళ‌లు సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు క‌నెక్ట్ అవుతుంది. సినిమా షూటింగ్ మేజర్ పార్ట్ పూర్తయ్యింది. 
 
మిగిలిన చిత్రీకరణను కూడా ప్లానింగ్ ప్రకారం పూర్తి చేసి సినిమాను అక్టోబర్ లేదా నవంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
 
 ద‌ర్శ‌కుడు నరేంద్ర మాట్లాడుతూ – “అన్ని ఎమోష‌న్స్ క‌ల‌గ‌లిపిన సినిమాయే ‘మిస్ ఇండియా’. కథ రాసుకున్న తర్వాత.. ఈ క‌థ‌కు కీర్తిసురేష్‌గారు మాత్రమే న్యాయం చేయగలరని నేను, మా నిర్మాత మహేశ్‌గారు భావించి ఆమెను కలిసి కథను వినిపించాం. ఆమెకు చాలా బాగా నచ్చి ఒప్పుకున్నారు. ఆమె సహకారంతో సినిమాను అనుకున్న ప్లానింగ్‌లో పూర్తి చేస్తున్నాం. 
 
రీసెంట్‌గా ఈ సినిమా యూరప్‌లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కొన్నిరోజుల షూటింగ్ మాత్రమే జరగాల్సి ఉంది. కుటుంబ క‌థా ప్రేక్ష‌కులు స‌హా అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది’’ అన్నారు. 
 
టీజర్లో ట్రెడిషనల్‌తో పాటుగా లేటెస్ట్ మోడరన్ లుక్‌లో కూడా కీర్తి సురేష్ అదిరిపోయింది. అంతేకాక టీజర్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునేలా ఉండడంతో, ప్రస్తుతం టీజర్‌కు వీక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. తెలుగుతోపాటు తమిళంలోను ఏకకాలంలో నిర్మితం అవుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను అక్టోబర్ లేదా నవంబర్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకే వేదికపై కనువిందు చేయనున్న పవన్, మహేష్.. ఎప్పుడు.. ఎక్కడ..?