Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేవలం 20 టిక్కెట్లు మాత్రమే సేల్.. ధాకడ్‌తో ఖంగుతిన్న కంగనా రనౌత్

Kangana Ranaut
, మంగళవారం, 31 మే 2022 (11:33 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజా చిత్రం ధాకడ్‌‌తో కలెక్షన్ల పరంగా బాగా వెనక్కి తగ్గింది. ఈ సినిమా హిట్ కోసం ఎంతో కష్టపడిన కంగనా రనౌత్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు.   
 
రజ్‌నీష్‌ ఘాయ్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ మూవీ మే 20న గ్రాండ్‌గా విడుదలైంది. రిలీజైన మొదటి రోజు నుంచే ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఎనిమిదో రోజైన రెండో శుక్రవారం (మే 27) దేశవ్యాప్తంగా కేవలం 20 టికెట్లు మాత్రమే అమ్ముడు పోయాయి. దీంతో రూ. 4,420 మాత్రమే వసూళ్లను రాబట్టగలిగింది. 
 
ఈ మూవీకి మొత్తం బడ్జెట్‌ రూ. 90 కోట్లు. ఇప్పటివరకు ధాకడ్‌ నమోదు చేసిన షేర్‌ రూ. 5 కోట్లలోపే అని చిత్ర వర్గాలు అంటున్నాయి. 
 
ఈ లెక్కన చూసుకుంటే కంగనా మూవీకి వచ్చిన నష్టం రూ. 85 కోట్లకు పైమాటే. దీంతో ఈ సినిమా అత్యంత భారీ నష్టాలు మిగిల్చిన బిగ్గెస్ట్‌ డిజాస్టర్ చిత్రాల జాబితాలో చేరింది. అంతేకాకుండా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన ఆ నష్టాన్ని భర్తీ చేలేదని బీటౌన్‌ టాక్.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీవీ నటి మైథిలి ఆత్మహత్యాయత్నం.. ఎందుకో తెలుసా...?