Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నటి జీవిత రాజశేఖర్‌పై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

Advertiesment
jeevitha
, శుక్రవారం, 3 నవంబరు 2023 (12:12 IST)
సినీ నటి జీవిత రాజశేఖర్‌పై సెన్సార్ బోర్డుకు నిర్మాత నట్టి కుమార్ ఫిర్యాదు చేశారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం చిత్రం సెన్సార్ రివైజింగ్ కమిటిలో సభ్యురాలిగా తాత్కాలికంగా ఆమెను పక్కన బెట్టాలని కోరారు. 
 
ఏపీలోని రాజకీయాలను ఆధారంగా చేసుకుని దర్శకుడు రాం గోపాల్‌వర్మ తెరకెక్కించిన చిత్రమే 'వ్యూహం'. ఈ నెల పదో తేదీన విడుదలవుతుంది. ఈ క్రమంలో సెన్సార్‌కు వెళ్లారు. అయితే, ఈ చిత్రం రాజకీయ వివాదాలను సృష్టించేలా ఉందని సెన్సార్‌ బోర్డు పేర్కొంది. 
 
దీనిపై రివ్యూ కమిటీకి వెళ్లాలని సూచించింది. సంబంధిత కమిటీలో జీవిత సభ్యురాలిగా ఉన్నారు. దాంతో, ఆమె అధికార వైకాపాకు అనుకూలమని, రివ్యూ కమిటీలో ఈ చిత్రానికి పచ్చజెండా ఊపేస్తారంటూ నట్టి కుమార్ వంటి నేతలు అనుమానం వ్యక్తం చేస్తూ సెన్సార్ రివైజింగ్ కమిటీ బాధ్యతల నుంచి తాత్కాలికంగా పక్కన బెట్టాలంటూ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై నటి జీవిత స్పందించారు. తనకు వైకాపాతో ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పలు మీడియాల్లో సర్క్యులేట్‌ అవుతోన్న తన ఫొటోలు (పార్టీ కండువాతో వున్నవి) పాతవేనని స్పష్టంచేశారు. తన గురించి కొందరు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. 
 
తాను ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నానని తెలిపారు. 'వ్యూహం' (అనే సినిమా ఆర్‌.సి (రివ్యూ కమిటీ)కి వచ్చినప్పుడు అన్ని సినిమాలు చూసినట్టుగానే దాన్నీ చూస్తా. అయితే నాకు ఆఫీస్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు' అని జీవిత వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సలార్ కోసం 750 వాహనాలు.. 500 రోజుల్లో రెడీ..?