Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాక్వెలిన్ 25న విచారణకు హాజరుకావాలని ఈడీ స‌మ‌న్లు

జాక్వెలిన్ 25న విచారణకు హాజరుకావాలని ఈడీ స‌మ‌న్లు
, గురువారం, 16 సెప్టెంబరు 2021 (20:11 IST)
Jacqueline
తెలుగు సినిమారంగంలో డ్రెగ్ కేసులో న‌టీన‌టులను విచార‌ణ చేస్తుంటే మ‌రోవైపు బాలీవుడ్ మ‌నీలాండ‌రింగ్‌, డ్రెగ్ కేసులోనూ కొంద‌రిని విచారిస్తున్నారు. ఇటీవ‌లే నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు డ్రగ్స్, మనీలాండరింగ్ కేసుల్లో భాగంగా సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. ఆ త‌ర్వాత ఈనెల 25వ‌ తేదీన విచారణకు హాజరుకావాలని తేల్చి చెప్పారు. 
 
మోస‌గాడైన సురేష్ తో సంబంధాలపై జాక్వెలిన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు విచారించనున్నట్లు సమాచారం. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను మొద‌టిసారి విచార‌ణ చేయ‌గా, మ‌రింత స‌మాచారం కోసం టైంను కేటాయించారు. ఈసారి విచార‌ణ‌లో పూర్తి తెలియ‌నున్నాని బాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో మాఫియా సినీమా రంగాన్ని ఏలుతుంది. ఇదివ‌ర‌కే దీనిపై ప‌లువురిపై కేసులు కూడా వున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా దాస‌రి కిర‌ణ్ కుమార్‌