Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రాణాపాయస్థితిలో 'జబర్దస్త్' టీం లీడర్‌... ఎవరు?

Advertiesment
ప్రాణాపాయస్థితిలో 'జబర్దస్త్' టీం లీడర్‌... ఎవరు?
, సోమవారం, 6 ఏప్రియల్ 2020 (13:39 IST)
ప్రముఖ తెలుగు చానెల్లో ప్రసారమయ్యే హాస్య కార్యక్రమాల్లో జబర్దస్త్ ఒకటి. ఈ కార్యక్రమంలో ఓ బృందానికి సారథ్యం వహిస్తూ వచ్చిన పంచ్ ప్రసాద్ ఇపుడు ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. ఈయనకు రెండు కిడ్నీలు పాడైపోవడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని నటుడు, ఆ కార్యక్రమ మాజీ వ్యాఖ్యాత నాగబాబుకు స్వయంగా పంచ్ ప్రసాద్ చెప్పి బోరున విలపించాడు. 
 
పంచ్ ప్రసాద్‌కు రెండు కిడ్నీలు 80 శాతం మేరకు పాడైపోయాయి. దీంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ డయాలసిస్ చేయించుకుంటూ రోజులు లెక్కించుకుంటున్నాడు. సర్జరీ చేయాల్సివుండగా, ఆర్థికస్తోమత లేనికారణంగా సర్జరీ కూడా ఇంకా చేయలేదు. ఈ విషయం తెలిసిన నాగబాబు.. మిగిలిన కమెడియన్స్‌ అంతా ముందుకువచ్చి, సహ నటుడుని కాపాడాల్సిందిగా కోరారు. 
 
కాగా, ఇప్పటికే పలువురు జబర్దస్త్ కమెడియన్లు పంచ్ ప్రసాద్‌కు తమకు తోచిన విధంగా ఆర్థిక సాయం చేశారట. కాగా, పంచ్ ప్రసాద్ 'పటాస్' షోలో అదిరిపోయే పంచ్‌లతో ప్రతి ఒక్కరినీ ఆలరించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడితో చక్కర్లు కొట్టిన నిర్మాత కుమార్తె... కరోనాతో స్వదేశానికి..