Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంతా గీత గోవిందం వల్లే.. గీతా ఆర్ట్స్2 మీద ఐటీ దాడులు?

Advertiesment
IT Raids
గీతా ఆర్ట్స్ తాజాగా గీత గోవిందం సినిమాను తెరకెక్కించింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు పరుశురాం తెరకెక్కించారు. గీతా గోవిందం చిత్రం స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా వసూళ్లు సాధించడం విశేషం. విజయ్ దేవరకొండ ఈ చిత్రంతో 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన హీరోగా మారిపోయాడు. అల్లు అరవింద్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించగా, బన్నీ వాసు నిర్మించారు. 
 
ఈ నేపథ్యంలో గీతగోవిందం సినిమా వసూళ్ల లెక్కలు తేల్చేందుకు ఐటీ అధికారులు జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ 2 కార్యాలయంపై దాడులు నిర్వహించినట్లు సమాచారం. వసూళ్లకు తగ్గట్లుగా ఆదాయపు పన్ను చెల్లించారా లేదా అనే విషయంలో అధికారులు డాక్యుమెంట్స్ పరిశీలించినట్లు తెలుస్తోంది. కాగా గీతా ఆర్ట్స్ బ్యానర్ కింద పలు విజయవంతమైన సినిమాలు తెరకెక్కాయి. 
 
ఇటీవల గీత ఆర్ట్స్ 2 పేరుతో మరో సంస్థని ప్రారంభించి అందులో సమర్పకుడిగా చిత్ర నిర్మాణంలో భాగమవుతున్నారు. తాజాగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించినట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి సరసన శృతిహాసన్.. చెర్రీ సరసన శృతి.. సినిమా పేరెంటి?