Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాల్మీకికి దూరంగా పూజా హెగ్డే... కారణమిదే..

Advertiesment
వాల్మీకికి దూరంగా పూజా హెగ్డే... కారణమిదే..
, గురువారం, 16 మే 2019 (16:49 IST)
ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే ఠక్కున చెప్పే పేరు పూజా హెగ్డే. ఇంకొక పేరు చెప్పాలంటే కొంచెం ఆలోచించాల్సిందే. ఆమెకు ఆ రేంజ్‌లో డిమాండ్ ఉంది మరి. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్-అల్లు అర్జున్ ఇలా హీరోలందరితోనూ వరుసబెట్టి సినిమాలు చేసేస్తోంది. 
 
ఇకపోతే వరుణ్ తేజ్ "వాల్మీకి"లో పూజా హెగ్డే ఉంటుందని ఒకసారి... లేదు రెమ్యూనరేషన్ విషయంలో ఏదో ఇష్యూ ఉండటం వల్ల చేయడం లేదని మరోసారి ఇలా రకరకాల ప్రచారం జరిగింది. దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం తాను చెప్పేంతవరకు ఏదీ నమ్మొద్దని తేల్చిచెప్పాడు. కానీ దీని తాలూకు అప్‌డేట్స్ మాత్రం లీకవుతూనే ఉన్నాయి. ఇప్పుడు వీటికితోడు మరొకటి వచ్చి చేరింది. 
 
పూజా హెగ్డేని "వాల్మీకి" కోసం ప్రతిపాదించింది నిజమే కాని కథ ప్రకారం అది వరుణ్ తేజ్ కోసంకాదట. ఇందులో హీరో లాంటి మరో కీలక పాత్ర చేస్తున్న తమిళ నటుడు అధర్వాకు జోడిగా అంట. అధర్వా మనవాళ్ళకు పూర్తిగా అపరిచితుడు. 'అంజలి', సిబిఐలో కనిపించాడు. కానీ, సినిమా ఫ్లాప్ కావడంతో ఎవరికీ గుర్తు లేదు. 
 
ఇప్పుడు పూజాను తన సరసన ఉంచడం అంటే ప్రేక్షకులు ఆమోదిస్తారా అనే ప్రశ్న మెదులుతోంది. "జిగర్ తండా" రీమేక్ అయినప్పటికీ హరీష్ శంకర్ దీనికి చాలా మార్పులు చేసినట్టుగా యూనిట్ చెబుతోంది. ఇంతకీ పూజా పాత్రకు సంబంధించి టీం అధికారికంగా క్లారిటీ ఇచ్చే దాకా తెలిసేట్లు లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సక్సెస్ రేట్ డౌన్.. ఇక లాభం లేదు.. యాక్టర్‌గా వీవీవీ..?